బస్సు షెల్టర్ ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు కుంభం

Published: Saturday May 22, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని నరసయ్య గూడెం గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పసల విజయ్ ఆనంద్ ఆధ్వర్యంలో తన తమ్ముడు కీ శే పసల సంపత్ కుమార్ జ్ఞాపకార్థం బస్ షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సంపత్ కుమార్ జ్ఞాపకార్థం గ్రామంలోని 100 మంది మహిళలకు చీరలు వంద కుటుంబాలకు ఇంటికో కిలో చికెన్ చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ రాజ్, సర్పంచ్ తుమ్మల దామోదర్, ఎంపీటీసీ పసల జ్యోతి, మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య, గోపాల్ ఫామ్ హౌస్ యజమాని సాయి కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ వాకిటి అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు బోళ్ల శ్రీనివాస్, జింకల దానయ్య, బాలశౌరి, ఆరోగ్యం, వినిసెంట్, బత్తిని సహదేవ్, లింగయ్య, కాసుల వెంకటేశం, కేదారి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.