ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday March 30, 2023
మేడిపల్లి, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి) 
ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను   డివిజన్ టిడిపి అధ్యక్షులు పబ్బతి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి, వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీ రామారావు సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ కోఆర్డినేటర్ అశోక్ గౌడ్, బి.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోళ రవి కుమార్ గౌడ్, చిలుకానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు తిక్క ప్రకాష్, ఉప్పల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బజారు హేమంత్ గౌడ్, ఉపాధ్యక్షుడు మౌలాలి(ఎన్.బి.కె), ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్, బంక రమేష్ మరియు సీనియర్ నాయకులు ఇమామ్, ఖాసిం , శరత్, దండుగుల స్వామి, రాజు పాల్గొన్నారు.