శివాలయం వద్ద వైరా నదిని పరిశీలించిన మల్లు నందిని
Published: Friday July 23, 2021
మధిర, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : భారీ వర్షానికి మధిర శివాలయం వద్ద పొంగి ప్రవహిస్తున్న వైరా నదిని జిల్లా కాంగ్రెస్ నాయకులు, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రికి వరద పెరిగే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంత ప్రజలకు కళ్యాణ మండపాల్లో ప్రత్యేక విడిది ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను కోరారు. ఆమె వెంట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు
Share this on your social network: