మున్సిపల్ కౌన్సిలర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే
Published: Friday September 24, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మునిసిపల్ 22వ వార్డు కౌన్సిలర్ గడ్డం అశోక్ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం నాడు తన ఇంటికి పోయి పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ తో మాట్లాడుతూ సంఘటన వివరాలను తెలుసుకున్నారు, ఇలాంటి పరిస్థితుల్లోనే మనం మనోధైర్యంతో ఉండాలని, తల్లిదండ్రులే మనకు సర్వస్వం అని వారే మనకు ప్రథమ గురువులని వారు లేని లోటును మనం తీర్చలేమని ఆయనకు మనో మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుదర్శన్, కాన్సిలర్లు రాములు నాయక్, టి ఆర్ ఎస్ నాయకులు బీమా గౌడ్, నూనెటి సత్యనారాయణ, తడక రవి, రెవెళ్లి విజయ్, శ్రీధర్, రాజేందర్, మధు, ఇబ్రహీం, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: