మున్సిపల్ కౌన్సిలర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే

Published: Friday September 24, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మునిసిపల్ 22వ వార్డు కౌన్సిలర్ గడ్డం అశోక్ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం నాడు తన ఇంటికి పోయి పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ తో మాట్లాడుతూ సంఘటన వివరాలను తెలుసుకున్నారు, ఇలాంటి పరిస్థితుల్లోనే మనం మనోధైర్యంతో ఉండాలని, తల్లిదండ్రులే మనకు సర్వస్వం అని వారే మనకు ప్రథమ గురువులని వారు లేని లోటును మనం తీర్చలేమని ఆయనకు మనో మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుదర్శన్, కాన్సిలర్లు రాములు నాయక్, టి ఆర్ ఎస్ నాయకులు బీమా గౌడ్, నూనెటి సత్యనారాయణ, తడక రవి, రెవెళ్లి విజయ్, శ్రీధర్, రాజేందర్, మధు, ఇబ్రహీం, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.