గ్రూప్ ఫోర్త్ ఏకేఆర్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ

Published: Thursday January 05, 2023
* మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 04 జనవరి ప్రజాపాలన : నిరుద్యోగార్థులకు గ్రూప్ ఫోర్త్ ఏకేఆర్ స్టడీ మెటీరియల్ ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని చైర్ పర్సన్ చాంబర్లో గ్రూప్ ఫోర్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చైర్ పర్సన్ మాట్లాడుతూ ఉద్యోగం సాధించేందుకు ఏకాగ్రత కఠోర శ్రమ అత్యంత ఆవశ్యకమని సూచించారు. తల్లిదండ్రులకు భారం కాకుండా స్వయం సాధన తో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి.వి రమణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, ఆర్వో శివ, ఏఈ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.