నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజీత్

Published: Friday July 16, 2021
మెట్ పల్లి, జూలై 15 (ప్రజాపాలన ప్రతినిధి) : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 16న పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్ కోరారు. గురువారం స్థానిక విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సకాలంలో ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.