మైనారిటీల సంక్షేమామే ప్రభుత్వ ద్యేయం.. మైనార్టీలకు కానుకల పంపిణీ

Published: Thursday May 06, 2021

బొంతపల్లి లో గొర్రెలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
గుమ్మడిదల, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : మైనారిటీల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన గుమ్మడిదల లో బుధవారం నిరుపేద ముస్లిం కుటుంబాల కు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటి సారిగా షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టడం అభినందనీయమని, రాష్ట్రంలోని అన్ని మతాలవారు తమ పండుగలను సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా సంక్షోభం సమయంలోనూ టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో వెనక్కి తగ్గడం లేదని అన్నారు, అనంతరం బొంతపల్లి లో 30 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. తదనంతరం టిఆర్ఎస్ సినియర్ నాయకులు సద్ది విజయ భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఎస్ ఐ విజయకృష్ణ, సీనియర్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, గటాటి భద్రప్ప, బొంతపల్లి ఎంపీటీసీ నాగేందర్ గౌడ్, గౌరి శంకర్ గౌడ్, గ్యారాల మల్లేష్, వినోద్, చక్రపాణి, కానుకుంట వెంకటేష్, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.