జిల్లా వ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రశాంతం

Published: Monday June 13, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూన్ 12 ప్రజాపాలన : 
జిల్లాలో 24 సెంటర్లలో టెట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల తెలియజేసినారు.
ఆదివారం జిల్లా కలెక్టర్ నిఖిల జిల్లా కేంద్రంలోని సంఘం లక్ష్మి బాయి బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) పరీక్ష కేంద్రాన్ని  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష జరుగుతున్న తీరును,  హాజరు శాతం, కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా వివరాలు, ఓ.ఎం.ఆర్. షీట్, పేపర్ కోడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష అనంతరం పత్రాలను బందోబస్తుతో తరలించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మొత్తంలో 5740 మంది పరీక్షకు హాజరు కావలసి ఉండగా,  5569 మంది హాజరైనారని, 171 మంది గైర్హాజరు అయినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి రేణుకదేవి, జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.