ఈనెల31నుంచి విజిలెన్స్ వారోత్సవాలు. ప్రజా పాలన అక్టోబర్ 26, . శ్రీరాంపూర్.
Published: Thursday October 27, 2022
సింగరేణి వ్యాప్తంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఈనెల 31 నుండి నవంబర్ 6 వరకు నిర్వహించడం జరుగుతుందని శ్రీరాంపూర్ జిఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, ఉపరితల గనులు వివిధ విభాగాలలో విజిలెన్స్ వారోత్సవాలను ప్రారంభించి ఉద్యోగులకు సమగ్రత ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా శ్రీరాంపూర్ ఏరియాలోని అధికారులకు ఉద్యోగులకు సింగరేణి పాఠశాల, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు
Share this on your social network: