మాలమహానాడు ఆధ్వర్యంలో 25వ రోజుకు చేరిన అల్పాహార పంపిణీ

Published: Thursday June 10, 2021

బెల్లంపల్లి, జూన్ 9, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణం లోని మాలమహానాడు నాయకులు పలువురి  దాతల సహాయంతో చేస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమం బుధవారం నాటికి 25వ రోజుకు చేరిందని మాల మహానాడు నాయకులు తెలిపారు. బుధవారం నాడు రెండో వార్డు కౌన్సిలర్ షేక్ అప్సర్ సమకూర్చిన అల్పాహారాన్ని స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్ ఐసోలేషన్ కేంద్రం వద్ద పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సందర్భంగా పట్టణంలోని ఐసోలేషన్ కేంద్రం వద్ద కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు మరియు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల యాచకులకు, హిజ్రాలకు, పట్టణంలోని దినసరి కూలీలకు నిరుపేదలకు దాదాపు 200 మందికి ప్రతిరోజు అల్పాహార పంపిణీ చేయడం జరుగుతుందని బుధవారం నాటికి ఆది 25వ రోజుకు చేరుకుందిని వారన్నారు.ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కుసుమ మధు సుధన్, రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆసాది మధు,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్, పలిగిరి కనకరాజు,పట్నం చక్రధర్, కట్ట ఉమాకాంత్,  తదితరులు పాల్గొని పంపిణీ చేశామని వారు తెలిపారు