చైర్ పర్సన్ మరియు కమీషనర్ జీలుగుమాడు నందు విస్తృత పర్యటన

Published: Thursday August 26, 2021
మధిర, ఆగష్టు 25, ప్రజాపాలన ప్రతినిధి : ఈ రోజు మధిర మునిసిపాలిటి పరిధిలోని ఒకటవ వార్డు జిలుగుమాడు నందు మునిసిపల్ కమీషనర్ ఎ.రమాదేవి మరియు చైర్ పర్సన్ యం.లత పారిశుధ్య పనులను పరిశీలించడం జరిగింది, అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సూచనలమేరకు సెప్టెంబర్ 1వ తారీకు నుండి అన్నీ స్కూల్స్ రి-ఓపెన్ చేస్తునందువల్ల కలెక్టర్ గారి ఆదేశాలమేరకు పట్టణంలోని ప్రభుత్వ స్కూల్ లను సానిటైజర్ చేసి, స్కూల్స్ అన్నీ శుభ్రంగా చేయమని సిబ్బందికి తెలియజేయడం జరిగింది, జీలుగుమాడు నందు ఉన్న స్కూల్ నీ శుభ్రం చేస్తుండగా కమీషనర్ గారు చైర్ పర్సన్ గారు పరిశీలించడం జరిగింది. పరిసరాలను శుభ్రముగా ఉంచుకోవాలని ఏరియా ప్రజలకు తెలియజేయడం జరిగింది.