25 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేత..

Published: Monday May 30, 2022

 ఖమ్మం,  మే 28 (ప్రజాపాలన న్యూస్): ఖమ్మంజిల్లా బోనకల్లు మండలంలోని సీతంపేట గ్రామంలో  జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న లబ్దిదారులకు డిస్ట్రిక్ట్ యన్ ఐ ఆర్ ఫౌండేషన్ బయ్యాన బాబు ఆర్ధిక సహాయంతో 25మంది మహిళలకు కుట్టు మిషన్ లు శనివారం పంపిణీ చేశారు. వీటిని జేఎస్ఎస్ ఖమ్మంజిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ, చైర్మన్ బయ్యాన బాబు  చేతులమీదగా లబ్ధిదారులకు కుట్టు మిషన్ లతోపాటు సర్టిఫికెట్స్ అందించారు. ఈ సందర్భంగా మహిళమండలి అధ్యక్షులు షేక్. రజియ, డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదగాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అన్నిరంగాలలో ముందడుగు వేయాలని సూచించారు. శ్రీసిటీ అధినేత ద్వారా ఇంతపెద్ద మొత్తంలో సహాయం అందించిన డిస్ట్రిక్ట్ యన్ ఆర్ ఐ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  జె యస్ యస్ స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ కవిత, జాస్మిన్, కిరున్నిసా బేగం, వైష్ణవి మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.