ఘనంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు

Published: Tuesday September 06, 2022

జన్నారం, సెప్టెంబర్ 05, ప్రజాపాలన: మండలంలోని ప్రభుత్వ, ప్రవేటు అన్ని పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డా, సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మాదినోత్సనాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా   మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని వివేకానంద పాఠశాలలో డా, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటం గీసి, చిత్ర పటానికి చిన్నారులు విద్యార్థులు నమస్కారం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హేడ్ మాస్టర్ అమరకోండ సతీష్ గౌడ్ మాట్లాడుతూ డా, సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 05 వ జన్మించారని అన్నారు. భారతదేశ రాష్టప్రతి గా 1962 నుంచి 1967 వరకు డా, సర్వేపల్లి రాధాకృష్ణన్ విధులు నిర్వహించారు. డా, సర్వేపల్లి రాధాకృష్ణన్1975 ఏప్రిల్ 17వ మృతి చేందారన్నారు. ఈ సందర్భంగా వివేకానంద పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులను శాలువలు, పూల మాలలతో సన్మానించారు. ఈ కార్యాక్రమంలో పాఠశాల హెచ్ ఎం సతీష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.