ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఏసీపీ రంగస్వామి

Published: Thursday July 22, 2021
మేడిపల్లి, జూలై 21 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, పోలీస్ అధికారి ఏసీపీ రంగస్వామి, ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి, ఎస్ఐ అడ్మిన్ జయరామ్ లు హాజరై ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి ప్రెస్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, పోలీస్ అధికారి ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్ రామ్ రెడ్డి, నరోత్తం రెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు సురేష్, సాగర్, శ్రీధర్ రావు, సంయుక్త కార్యదర్శి శివాజీ, కోశాధికారి యాదగిరి, ముఖ్య సలహాదారులు సురేష్, మహేందర్ రెడ్డి, జర్నలిస్ట్ కిషోర్, ఉప్పల్  డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.