కోదాడ బహిరంగ సభను విజయవంతం చేయాలి.. రాష్ట్ర అధ్యక్షులు సైదులు నాయక్..
Published: Saturday November 19, 2022
వైరా, నవంబర్ 18 (ప్రజాపాలన న్యూస్):
నవంబర్ 20వ తేదీన కోదాడ లో జరిగే తెలంగాణ లంబాడ సేవా సమితి బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలంగాణ లంబాడ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు బాదావత్ సైదులు నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడలో జరిగిన సంఘం రాష్ట్ర సమావేశంలో సైదుల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గిరిజనులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తున్నారని, తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 20న జరిగే రాష్ట్ర మహాసభకు భారీగా గిరిజనులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ లాంబాడీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు బానోతు పద్మభాయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతృ నాయక్, నాయకులు గుగులోతు రమేష్, జటోత్ కుమార్, వాంకుడోతు రవి, అజ్మీరా రాము, స్వాతి, విజయ, జర్పుల ప్రసాద్, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: