20వ డివిజన్లలో డ్రైనేజ్ మెయిన్ వాల్స్ రిపేర్

Published: Friday June 18, 2021
బాలపూర్, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : వచ్చేది వర్షాకాలం డివిజన్లలో ప్రతి డ్రైనేజ్ మెయిన్ వాల్స్ పరిశీలించి రిపేర్ చేయిస్తున్న కార్పొరేటర్ మద్ది సబిత రాజశేఖర్ రెడ్డి. మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20వ డివిజన్ లోని గాయత్రీ నగర్, ప్రతి కాలనీలలో డ్రైనేజ్ మెయిన్ వాల్స్ రిపేర్ వర్కు చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ అక్కడికి వెళ్లి సిబ్బందిని అడిగి తెలుసుకొని కాలనీ వాసులతో ఆమె మాట్లాడుతూ..... వర్షాకాలం లో కాలనీవాసులు అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందిని అన్నారు. గాయత్రి నగర్ ఏరియాలో అన్ని మెయిన్ వాల్స్ క్లీన్ చేయించి రిపేరు చేయడం జరుగుతుందిని చెప్పారు. ఇలా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్న మీర్ పేట్ కమిషనర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, కాలనీ పెద్దలు ప్రభాకర్, అప్పారావు, రమేష్, వీర రాజు, ప్రవీణ్ రెడ్డి, వంశి బాబు, తదితరులు పాల్గొన్నారు.