బోరుబావికి భూమిపూజ చేసిన ఎంపీపీ శ్రీనివాసరావు

Published: Friday June 17, 2022
తల్లాడ, (ప్రజాపాలన న్యూస్): తల్లాడ
మండల పరిధిలోని  బాలపేట గ్రామంలో స్మశాన వాటికలో బోరుబావి నిర్మాణంకు ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల అవసరాలకు ఆనుగుణంగా పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ కోసూరి వెంకట నరసింహారావు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు పులి కృష్ణయ్య, స్పెషల్ ఆఫీసర్ భద్రమ్మ, పంచాయతీ కార్యదర్శి  మహేష్,  పాల్గొన్నారు.