జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నియామకం

Published: Thursday January 27, 2022
కోరుట్ల, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులను బుధవారం రోజున నియమించారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా తోట ఆగయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు లను నియమించారు. జిల్లా అధ్యక్షులు నియామకం పట్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు తెరాస నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.