ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి : కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి
Published: Wednesday September 22, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా వైరస్ ను నివారించడానికి ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి సూచించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఎస్ టి ఓ, విద్యుత్ కార్యాలయాల్లో మరియు బుద్దానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మారి కరోనా నియంత్రణకు టీకా తప్పనిసరి కావున అందరు మొదటి మరియు రెండవ డోసు కరోనా టీకా వేయించుకోగలరనీ, ఇంకెవరైనా తీసుకోవాల్సినవారుంటే తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Share this on your social network: