బి ఆర్ ఎస్ నేతల సంబరాలు

Published: Saturday December 10, 2022
జన్నారం, నవంబర్ 09, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ ఇచ్చిన తరుణంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో నూతన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుర్రం రాజరాంరెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీని గ్రామ గ్రామాన పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని వారు సూచించారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. నిరుపేదల సంక్షేమానికి బి బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని ధర్మారం గ్రామంలో లబ్ధిదారునికి ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కును వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్ మండల కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీ ఖాన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భరత్ కుమార్ వీ నర్స గౌడ్ రియాజుద్దీన్ ఆడెపు లక్ష్మీనారాయణ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.