మధిర సీఐని అభినందించిన ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్

Published: Thursday January 05, 2023

మధిర రూరల్ డిసెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి  ఖమ్మం పోలీస్ హెడ్ కోటర్స్ లో 22 రోజులుగా నిర్వహించిన పోలీస్ దేహ దారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయటంలో సహకారం అందించిన మధిర సిఐ ఒడ్డేపల్లి మురళిని బుధవారం ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్ అభినందించారు. ఈవెంట్లు సజాగా సజావుగా సాగేందుకు సీఐ మురళి ఇన్చార్జిగా కొంతమంది సిబ్బందితో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి కొన్ని బాధ్యతలు అప్పగించారు. మధిర సీఐ మురళికి అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసినందుకు సిపి విష్ణు ఎస్ వారియర్ చేతుల మీదగా మధిర సీఐ మురళి ప్రశంసా పత్రం అందుకున్నారు