ప్రతి భారతీయుని హృదయ మందిరంలో శ్రీరాముడు

Published: Thursday February 11, 2021
కెరెల్లి గ్రామంలో కొత్తపల్లి రామకృష్ణారెడ్డి రూ. 1,01,116 విరాళం
కెరెల్లి గ్రామంలో మొత్తం విరాళం రూ.1,17,116లు.
మాజీ మంత్రి బిజెపి నేత డాక్టర్ ఎ.చంద్రశేఖర్ రూ.1, 11, 116లు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10 ( ప్రజాపాలన ) : ప్రతి భారతీయుని హృదయంలో భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మాణం చేయాలనే సంకల్పబలం ఉందని మాజీ మంత్రి బిజెపి నేత డాక్టర్ ఎ‌.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ధారూర్ మండలానికి చెందిన కెరెల్లి గ్రామంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం గ్రామ ఇంచార్జ్ మంగమ్మోల్ల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, జాతీయ లీగల్ సెల్ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటిగారి శివరాజ్ ల తో కలిసి కెరెల్లి గ్రామంలో శ్రీరామ మందిర నిర్మాణానికి భూరి విరాళాలు సేకరించారు. జనరస్ ఫార్మాస్యూటికల్ ఆఫ్రికా లిమిటెడ్ డైరెక్టర్ కొత్తపల్లి రామకృష్ణారెడ్డి రూ.1,01,116 లు విరాళంగా అందజేశారు. అదే విధంగా మాజీ మంత్రి బిజెపి నేత డాక్టర్ ఎ.చంద్రశేఖర్ రూ. 1,11,116 లు విరాళంగా చెక్కును ఇచ్చారు. కులమతాలకు అతీతంగా గ్రామస్థులు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహకారం అందించారు. గ్రామానికి చెందిన ఆశం రూ.11, 000లు విరాళంగా సమర్పించారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే దళిత సామాజిక కుటుంబాలు తమ శక్తికి మించి విరాళాలు అందివ్వడం ప్రశంసనీయం. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పోలీస్ శ్రీనివాసరెడ్డి, కావలి వెంకటయ్య, దాసరి వెంకటయ్య, శ్రీకాంత్, బిజెపి నాయకులు ప్యాట శంకర్, నవీన్ కుమార్, వివేకానంద రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
Attachments area