పీర్జాదిగూడ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం మంత్రి చామకూర మల్లారెడ్డి

Published: Friday September 17, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కార్మికశాఖ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ బుద్దానగర్ రోడ్ నంబర్ 5లో రూ10.00 లతో సీసీ రోడ్డు, డ్రైనేజి పనులను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ మద్ది యుగేంధర్ రెడ్డి లతో కలిసి కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.