శేఖర్ కుటుంబానికి న్యాయం చేయండి జెడ్పిటిసి సంతోష్ ఆధ్వర్యంలో ధర్నా బెల్లంపల్లి అక్టోబర్ 9

Published: Monday October 10, 2022
సరైన వైద్య సహాయం అందక డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే గుండేటి శేఖర్ మరణించాడని అతని కుటుంబానికి న్యాయం చేయాలని జెడ్పిటిసి వేముల సంతోష్ కేంద్ర కార్యదర్శి భోగి ఉపేందర్ సిపిఐ మండల కార్యదర్శి దుర్గం రవీందర్ ల ఆధ్వర్యంలో గోలేటి జిఎం కార్యాలయం ముందు ఆదివారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వైద్యుల నిర్లక్ష్యం వల్లనే, సరైన వైద్య సహాయం అందించక పోవడం వల్లనే  గుండేటి శేఖర్ మృతి చెందాడని, మృతి చెందిన శేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు,
 
కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం  ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వహించి మృతికి కారకులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు,
స్పందించిన జిఎం దేవేందర్, శేఖర్ కుటుంబాన్నీ అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు,అనంతరం దహన సంస్కరణల కోసం జిఎం దేవేందర్ గారు 20వేలు ఆర్థికంగా ఇచ్చారు,