C. M రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Wednesday September 22, 2021
భట్టి విక్రమార్క చొరవతో సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు
మధిర, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మర్లపాడు, మడుపల్లి గ్రామాల లోని పలువురు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం అక్కడ అయిన ఖర్చు ను తమ కుటుంబ ఆర్దిక పరిస్థితులు దృష్ట్యా సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందించాలని కోరుతూ. మధిర శ్యాసన సభ్యులు మల్లుభట్టి విక్రమార్క ద్వారా దరఖాస్తు చేసుకోగా మల్లుభట్టి విక్రమార్క సిఫార్సు మేరకు పలువురికి సీఎం సహాయ నిధి నుండి చెక్కులు మంజూరు అయ్యాయి. కాగా అట్టి చెక్కులను ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిశోర్ చేతుల మీదుగా అందించటం జరిగింది, లబ్దిదారులకు వివరాలు. Nఆనందరావు. మడుపల్లి.. 15,000 T.రాములమ్మ, మర్లపాడు. 19,500, వారికి అందించటం జరిగింది.. ఈ కార్యక్రమంలో మధిర మండల sc సెల్ అధ్యక్షులు దారా బాలరాజు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డిమండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్, మండల అధ్యక్షుడు కోరంపల్లి చంటి, పట్టణ  అధ్యక్షులు షేక్ బాజిటౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, కాంగ్రెస్ నాయకులు ఆదిములం శ్రీనివాసరావు, మొదలగు వారు పాల్గొన్నారు.