నేత్రధానంతో యిద్దరు అంధులకు దృష్టి దానం.
Published: Friday February 17, 2023
మధిర ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడువాస్తవ్యులు చల్ల వెంకటేశ్వర్లు ఈనెల ఆరో తేదీ మరణించగా, వారి కుమారుడు సుధాకర్, తండ్రినేత్రాలను, వారి ఆశయం మేరకు, దానం చేసి, ఇరువురు కార్నియా అంధులకు చూపు నొసంగారు. ఈరోజు, పెద్దకర్మ సందర్భంగా,ప్రశంసా పత్రము, ముమెంటో, ఖమ్మం నేత్రనిధి బాధ్యులు మాధవరపు నాగేశ్వరరావు, ప్రముఖ వైద్యులు వాసిరెడ్డి రామనాధం, జిల్లా ఆర్యవైశ్యసంఘం మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ల లక్ష్మీ నరసింహారావు చేతులు మీదుగా, సుధాకర్ కి అందచేశారు.*
*నేత్రదానం విషయంలో అపోహలు, అనుమానాలు నాగేశ్వరరావు నివృత్తి చేస్తూ, సంబంధింత కర పత్రాలను పంచారు. నేత్రదానానికి అందరూ ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగా అప్పారావు, ఇరుకుళ్ల రాధాకృష్ణ, పల్లబోతు ప్రసాద్, కోనా ఈశ్వర్, సంగయ్య, చల్లా వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పాల్గొని, నేత్రదానానికి మద్దతు తెలిపారు
Share this on your social network: