చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవు

Published: Thursday July 22, 2021
ఇబ్రహీంపట్నం నూతన ఎస్సై నినిషారెడ్డి
ఇబ్రహీంపట్నం, జూలై 21, (ప్రజాపాలన ప్రతినిధి) : ఇబ్రహీంపట్నం మండల నూతన ఎస్సైగా నినిషా రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలోని ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు అక్రమ ఇసుక రవాణా, బెల్ట్ షాపులు, పేకాట, గుట్కా, గంజాయి, అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేస్తే కఠినంగా శిక్షలు తప్పవు అన్నారు.