గాంధారి మైసమ్మ జాతర కు రండి.

Published: Wednesday February 16, 2022
బెల్లంపల్లి, ఫిబ్రవరి 15, ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బొక్కల గుట్ట వద్ద ఈ నెల 18 నుంచి జరిగే గాంధారి మైసమ్మ జాతర ఉత్సవాలకు హాజరుకావాలని మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ కు నాయికపోడు సంఘం నాయకులు ఆహ్వానించారు. మంగళవారం బెల్లంపల్లిలో తన నివాసంలో అయనను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జాతర చైర్మెన్ రమేష్ మాట్లాడుతూ గత దశాబ్దాల కాలంగా జరుగుతున్న గాంధారి మైసమ్మ జాతర ఉత్సవం ఘనంగా జరుగుతున్నాయని అందులో భాగంగా 18 నాడు జరిగే పెద్ద పూజా కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతర చైర్మన్ రోడ్డ రమేష్ తో పాటు జిల్లా నాయకపోడు సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్, కాసి పేట జడ్పిటిసి పల్లె చంద్రయ్య, అరుణ్ కుమార్, ఏదుల రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.