కెసిఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన సందర్భంగా జగిత్యాల టీఆరెఎస్ పార్టీ సంబరాలు..

Published: Thursday October 06, 2022

జగిత్యాల, అక్టోబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి): టిఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీని ప్రకటించిన సందర్భంగా వారి ప్రకటనకు మద్దతుగా ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గపిలుపు మేరకు జగిత్యాల పట్టణ తహసిల్ చౌరస్తా వద్ద టీఆరెఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు కట్రొజ్ గిరి ఆధ్వర్యంలో బాణ సంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి సకల జనులను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ బిడ్డ ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజానీకం కెసిఆర్ కి అండగా ఉండి కుల, మత రాజకీయాలు చేసే పార్టీ లను చరమగీతం పాడాలని ఆ సమయం బి అర్ ఎస్ తో అసన్న మైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి  ఆనంద్ రావు, మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజహీద్, తెరాస విద్యార్ధి విభాగం అధ్యక్షులు ఎం.ఏ. ఆరీప్, కార్మిక విభాగం పాళోజి సత్యం,నాయకులు నీలి ప్రతాప్, పులి నర్సయ్య, సయ్యద్ గౌస్, కూతుబ్ఉద్దీన్, రవి, సంకే మహేష్, క్రాంతి, జీవన్,రాజేష్, గంగాధర్, ఉదయ్, ఠాకూర్ జగన్, సల్మాన్, చిన్ను, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.