విజ్ డమ్ శ్రీ విద్యా భారతి విద్యాసంస్థలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
Published: Saturday August 20, 2022
కొడిమ్యాల, ఆగస్టు 19 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విజ్ డమ్ శ్రీ విద్యా భారతి విద్యాసంస్థలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం దీకొండ అశోక్, ఇక్బాల్ ఖాన్, వార్డు సభ్యులు దీకొండ చంద్రశేఖర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: