మున్నూరు కాపు కమిటీ ఏకగ్రీవం

Published: Monday March 01, 2021
అద్యక్షుడిగా పువ్వాల అజయ్ బాబు, కార్యదర్శిగా కమటం వెంకన్న
పాలేరు, ఫిబ్రవరి 28, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి మండల మున్నూరు కాపు పటేల్. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొవడం జరిగింది.ఈసమావేశంలో మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు పటేల్, సెక్రటరీ కలిశెట్టి విజయకుమార్ పటేల్, రాష్ట్ర నాయకులు ఆకుల గాంధీ పటేల్, ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది అధ్యక్షుడిగా. పువ్వాల అజయ్ బాబు పటేల్, కార్యదర్శిగా కమటం వెంకన్న పటేల్,  కోశాధికారిగా పురం నరసింహారావు పటేల్, ఇంకా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు పటేల్, తోట శ్రీను పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.