నేడేపీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయండి

Published: Tuesday April 19, 2022
మధిర ఏప్రిల్ 18 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో మండల కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు జరిగే పాదయాత్రకు భారీగా కాంగ్రెస్ అభిమానులు అన్ని సంఘాల నాయకులు పాల్గొనిప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర నేడుసాయంత్రం నాలుగు గంటలకు మధిర పట్టణంలోకి ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క ఆధ్వర్యంలో మధిర పట్టణ కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మధిర పట్టణంలో జరుగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్రఅధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకట రమణ గుప్త మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు మధిర పట్టణ పాదయాత్ర కమిటీ ఇన్చార్జిలు పైడిపల్లి కిషోర్, అంబటి వెంకటేశ్వర్లు, పసుపులేటి దేవేంద్ర మరియు మున్సిపాలిటీ కౌన్సిలర్ లు కోన ధనికుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మధిర పట్టణ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్ ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ అలీ మరియు డివిజన్ కమిటీ అధ్యక్షులు అన్ని శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు