కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేఖానాయక్

Published: Thursday June 16, 2022

జన్నారం రూరల్, జున్ 15, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం ఎంపిడివో కార్యాలయంలో కల్యాణలక్ష్మి లబ్ధి దారులకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బుధవారం చెక్కులు అందచేశారు, ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ  కృషి చేస్తున్నారు, రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రభుత్వం అలోచనలో వుందన్నారు, అదేవిధంగా బాదంపల్లి నుండి దర్మారం వరకు బిట్ రోడ్డు  కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పనులు ఎమ్మెల్యే  ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజారాం రేడ్డి, మండల ఎంపిపి మాదడి సరోజన, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.