వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు

Published: Saturday September 03, 2022
వైయస్ రాజశేఖర్ రెడ్డి  13వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు
 
 
పాలేరు సెప్టెంబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి  విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న రోగులకు మరియు పాలు బ్రెడ్ ఫ్రూట్స్  పంపిణీ చేశారు 
తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ మరియు ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు  మాట్లాడుతూ
 
 ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది పేద ప్రజలు రకరకాలుగా జబ్బులు వచ్చిన రోడ్డుపై యాక్సిడెంట్ అయినా గుండెపోటు వచ్చిన కిడ్నీ స్టోన్స్ కానీ లివర్ క్యాన్సర్ గాని కాళ్లు ఎరిగిన చేతులు ఎరిగిన మనిషికి ఏ జబ్బు వచ్చినా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు
108
రైతులకు ఉచిత కరెంట్
రూపాయికి కిలో బియ్యం
రైతులకు రుణమాఫీ
పెన్షన్
జలయజ్ఞం
ఇందిరమ్మ ఇల్లు
ఫీజ్ రీఇంబర్స్ మెంట్
సాగునీటి ప్రాజెక్టు 
పేదలకు భూమి పంపిణీ
ఇందిరా జలప్రభ బోర్లు
 ఐటీ రంగాన్ని తీసుకువచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి ది
రైతు బాంధవుడు పేదల పెన్నిధి విలువలు విశ్యసనీయత భరోసా కు మారుపేరు సంక్షేమ సామ్రాట్ గా ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రజల మనిషి మరుపురాని మహానేత అపర భగీరథుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు
 
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాజా సత్యనారాయణ మధార్ యూత్ కాంగ్రెస్ నాయకులు బత్తుల రమేష్ పిడమర్తి రాజేష్ అజ్మీర మోహన్ వీరన్న శరత్ మరియు హాస్పిటల్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు