తుర్కయంజాల్లో నేడు వివిధ దేవాలయాలకు పునర్నిర్మాణ శంకుస్థాపనలు,హోమాలు

Published: Monday April 18, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి : అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నేడు సోమవారం తేది 18.4.2022 రోజున ఉదయం 6 గంటలకు తుర్కయంజాల్ లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, శివాలయం, సత్యనారాయణ స్వామి, అమ్మవారి ఆలయాల పునర్నిర్మాణం కోసం హోమ కార్యక్రమాలు, శంకుస్థాపనలు జరుపబడతాయని, ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులేయని తెలిపారు. దయచేసి ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వాళ్ళు తమ జంటలతో అయినా సరే  లేదా ఎవరైనా పాల్గొనవచ్చునని, హోమ కార్యక్రమానికి సకాలంలో విచ్చేసి తీర్థ ప్రసాదలను స్వీకరించి, అనంతరం భక్తులకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తుళ్ళ నర్సింహా గౌడ్ తెలిపారు.