తుర్కయంజాల్లో నేడు వివిధ దేవాలయాలకు పునర్నిర్మాణ శంకుస్థాపనలు,హోమాలు
Published: Monday April 18, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి : అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నేడు సోమవారం తేది 18.4.2022 రోజున ఉదయం 6 గంటలకు తుర్కయంజాల్ లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, శివాలయం, సత్యనారాయణ స్వామి, అమ్మవారి ఆలయాల పునర్నిర్మాణం కోసం హోమ కార్యక్రమాలు, శంకుస్థాపనలు జరుపబడతాయని, ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులేయని తెలిపారు. దయచేసి ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వాళ్ళు తమ జంటలతో అయినా సరే లేదా ఎవరైనా పాల్గొనవచ్చునని, హోమ కార్యక్రమానికి సకాలంలో విచ్చేసి తీర్థ ప్రసాదలను స్వీకరించి, అనంతరం భక్తులకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తుళ్ళ నర్సింహా గౌడ్ తెలిపారు.
Share this on your social network: