రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ** ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్

Published: Wednesday August 24, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు23 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 3 విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయినట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థి ఏ వినోద్, 400 మీటర్లు, పరుగు పోటీల్లో అండర్-16 విభాగంలో, 8వ తరగతి విద్యార్థి చరణ్ 100 మీటర్లు, పరుగు పోటీల్లో అండర్ 14 విభాగంలో, జిల్లా స్థాయి మొదటి స్థానం సాధించగా, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ఎన్ మహేష్ జిల్లాస్థాయి ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 24, 25, తేదీల్లో మెదక్ లో జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ బి తిరుపతి, ఉపాధ్యాయులు కమిటీ సభ్యులు అభినందించారు.