ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన పరమేశ్వర్ రెడ్డి

Published: Tuesday October 04, 2022
మేడిపల్లి, అక్టోబర్3 (ప్రజాపాలన ప్రతినిధి)
  దసరా ఉత్సవాల ఏర్పాట్లకై ఉప్పల్ దసరా ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి సోమవారం మున్సిపల్ అధికారులు ఈఈ నాగేందర్, డిఈ చందన ఇతర విభాగాల అధికారులు మరియు ఉప్పల్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి మున్సిపల్ స్టేడియంలో  ఏర్పాట్లను పరిశీలించారు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో  చెత్తచెదారం తొలగింపు, బురద లేకుండా చూడాలని, ఉత్సవ వేడుకలకు వచ్చే ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షులు పాలడుగు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మహంకాళి రాజు, ప్రధానకార్యదర్శి గొరిగే మహేష్, పాశికంటి నాగరాజు,బకారం లక్ష్మణ్, తుమ్మల దేవి రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి ,లింగంపల్లి రామకృష్ణ, మంద మురళీ కృష్ణ రెడ్డి,సుంకు శేఖర్ రెడ్డి,  వర్కాల మధన్ గౌడ్,,గోరిగే నగేశ్,ఉల్చా రాజు, గోరిగే జాంగీర్, బర్ల కృష్ణ ,ప్రేమ్, ఎర్రవల్లి కృష్ణ గారు ,రామ్ రెడ్డి ,పండ్ల బాలయ్య ,కోమటి రెడ్డి కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.