ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ పై అవగాహన కార్యక్రమం

Published: Tuesday November 30, 2021
మేడిపల్లి, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ వస్తున్నదని కావున ప్రజలందరూ తప్పని సరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప్పల్ ట్రాఫిక్ ఇనస్పెక్టర్లు నర్సింగ్ యాదయ్య, కాశీ విశ్వనాథ్ లు సూచించారు. ఈ మేరకు రాచకొండ పోలీసు ఉన్నతాధికారుల అదేశం మేరకు ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు ఉప్పల్ చౌరస్తాలో వాహనదారులకు, ప్రయాణికులకు కొత్తగా పుట్టుకొస్తున్న కరోన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ ట్రాఫిక్ ఇనస్పెక్టర్లు నర్సింగ్ యాదయ్య, కాశీ విశ్వనాథ్ లు మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తున్నదన్న నేపథ్యంలో ఇంటి నుండి బయటకు వెళ్లేవారు, వాహనాదారులు, ప్రయాణికులు ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ, తరచూ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం చేసుకోవాలన్నారు. మాస్కులు ధరించని వారిపై సెక్షన్ 51 మరియు 60 డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆక్ట్ 2005 ప్రకారం రూ1,000/- జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యస్.ఐ. కృష్ణస్వామి, ఏ.యస్.ఐ. శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.