జాతీయ రహదారి పై ఇరిగేషన్ నిర్మాణాల ను పరిశీలించిన అధికారులు.

Published: Saturday November 05, 2022
పాలేరు నవంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణాల పై జరుగుతున్న ఇరిగేషన్ పనులను అధికారులు శుక్రవారం పరిశీలించారు. మండలంలోని నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం, కొత్తకొత్తూరు, బోదులబండ గ్రామాల మధ్య జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేషనల్ హైవే అథారిటీ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మ, కన్సల్టెంట్ రామిరెడ్డి లు పరిశీలించారు. నీటి కాలువ లపై పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. మండలంలో మొత్తం 38 చోట్ల జాతీయ రహదారి పై నీటి కాలువల పనులు చేపడుతున్న పనులను క్షేత్ర స్థాయిలో కొలతలు తీసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఈ మన్మధరావు జెఈ రత్నగీత, పవల్బెక్ కంపెనీ ప్రతినిధులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.