టిఆర్ఎస్ పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా కృషి

Published: Friday September 03, 2021
నారాయణపూర్ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 02 సెప్టెంబర్ ప్రజాపాలన : గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా కృషి చేస్తామని గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డి లు సంయుక్తంగా అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీని విస్తృత పరిచేందుకు గ్రామ కమిటీ వేయనున్నామని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వాన్ని పెంచేందుకు గ్రామ కమిటీలు తోడ్పడుతాయని వివరించారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకం జనాదరణ పొందాయని గుర్తు చేశారు. టిఆర్ఎస్ పార్టీకి ఎళ్ళవేళలా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కో ఆర్డినేటర్ ప్రహ్లాద్ రెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్ బుచ్చయ్య, బిసి సెల్ అధ్యక్షుడు మల్లేష్, సీనియర్ నాయకుడు సత్యనారాయణ గౌడ్, మల్ రెడ్డి, ముకుంద్ రెడ్డి, లక్ష్మయ్య, కుర్వ రాములు, మహేందర్ రెడ్డి, కావలి శ్రీనివాస్, బి.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.