భూముల సమస్యలకు పరిష్కారం చూపుతాం..
Published: Tuesday January 18, 2022
ఎర్రుపాలెం జనవరి 17 ప్రజాపాలన ప్రతినిధి: భూముల సమస్యలకు పరిష్కారం చూపుతాం అని ఖమ్మం జిల్లా ఆర్డిఓ రవీంద్రనాథ్ అన్నారు. మండల పరిధిలోని పెద్ద గోపవరం, రేమిడిచర్ల, అయ్యవారిగూడెం గ్రామాల పరిధిలోని రెవెన్యూ భూములలో పిటిఓ పట్టాల ఆన్లైన్ లో లేకపోవడంతో రైతులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. త్వరితగతిన రైతులకు సంబంధించిన భూముల పెండింగ్ లను జాబితా తయారు చేసి సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కెఎమ్ఏ అన్సారీ, ఆర్ఐలు లక్ష్మయ్య, భాష తదితరులు ఉన్నారు
Share this on your social network: