కళాశాల విద్యార్థులకు ఆయుర్వేద మందులు పంపిణీ

Published: Tuesday January 24, 2023
బోనకల్ జనవరి 23 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరి బోనకల్ డా॥ తన్నీరు రాంప్రసాద్ వారి ఆద్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు సోమవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేయడం జరిగినది. 45 మంది బాలికలకు, 50 మంది బాలురుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నళినిశ్రీ ,
ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఫార్మసిస్ట్ పి పద్మ
పాల్గోన్నారు.