దిర్సoపల్లిలో ప్రశాంతంగా కరోనా క్యాంపు

Published: Friday June 11, 2021
పరిగి జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి గ్రామంలో కరోనా టెస్టు క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంప్ లో భాగంగా గ్రామంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2:30 నిమిషాల వరకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్యులు అయితే మొత్తం 99 టెస్టులు నిర్వహించగా అందులో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం గ్రామంలో 13 ఆక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. భయమేమి లేకుండా మందుల్ని సకాలంలో వాడుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితీని ఆశ వర్కర్ లకు సమాచారం అందిస్తూ ఉండాలని పాజిటివ్ వ్యక్తులకు వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఏ ఎన్ ఎం, ఆశవర్కర్ లు పాల్గొన్నారు.