కరోనా నివారణకు నియమాలు పాటించాలి ఏసీపీ
Published: Thursday April 29, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి కరోనా నివారణకు కఠిన నియమాలు పాటించాలని చౌటుప్పల్ ఏసిపి సత్తయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాల వెంట వెళ్లి యజమానులకు కరోనా పట్ల దుకాణాలకు వచ్ఛే వినియోగ దారులు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని, లేనిచో వారికి అవగాహన కల్పించే విదంగా చర్యలు తీసుకోవాలని దుకాణాల యజమానులకు వివరించారు. కరోనా నివారణ పట్ల మాస్కులు లేనివారికి చాలాన్లు విధించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట స్థానిక ఎస్సై రాఘవేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: