ఎన్సిడి కిడ్స్ పంపిణీ

Published: Thursday October 27, 2022

జన్నారం, అక్టోబర్ 26, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తబలాపూర్ గ్రామంలో బీపీ షుగర్ రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసి బుధవారం అరోగ్య వైద్యులు ఎన్సిడి కిడ్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీపీ షుగర్ రోగులకు, ఆరోగ్య వైద్యులు మందులు పంపిణీతో పాటు ఎలా వాడాలో, ఎలా భద్రపరుచుకోవాలో, ఏ సమయంలో వేసుకోవాలో, తెలుపుతూ ఉండే ఎన్సిడి కిడ్స్ పంపిణీ చేయడం జరిగిందని ఆరోగ్య వైద్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో తపాలాపూర్ గ్రామ సర్పంచ్ నైయనాల తిరుపతి, ఆరోగ్య కార్యకర్త  కొల్లూరు కమలాకర్, ఆరోగ్య కార్యకర్త అపరంజి, లలిత  విజయ, ఆశాలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.