దారెల్లి వినయ్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి యువనేత ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉం

Published: Thursday September 08, 2022
బోనకల్, సెప్టెంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: స్థానిక మండల కేంద్రంలో దారెల్లి వినయ్ భార్య దారెల్లి సుప్రియ ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చి మరణించారు. బుధవారం నాడు సుప్రియ దశదినకర్మకు యువనేత బీపీ నాయక్ పాల్గొని వినయ్, అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ,పసిపాపను సందర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గాలి మురళి, కిషోర్, నాగేంద్రబాబు, సైదులు, సూర్య, లక్ష్మీ, గోపీనాథ్, అచ్యుత్ పవన్ తదితరులు పాల్గొన్నారు.