పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

Published: Tuesday September 13, 2022

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 12, ప్రజాపాలన: పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం రోజున లక్షేట్టిపేట్ మండల విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.   ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు రబియా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని, నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ప్రభుత్వం చెల్లించే బిల్లులు సరిపోవడం లేదని, కోడి గుడ్డును ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని , ఆరోగ్య భద్రత ,10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, పిఎఫ్,ఈఎస్ఐ  సౌకర్యలు కల్పించాలని, ప్రతి విద్యార్థికి 15 రూపాయల చొప్పున బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పలు సమస్యల ను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, మల్లవ్వ, రజిత, ఎల్లవ్వ, పెద్ద మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.