జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ రాణించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

Published: Monday October 10, 2022

జగిత్యాల, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ రాణించాలని, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు కెసిఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, భారతదేశ ప్రజలందరికి తెలంగాణ పథకాలు అందాలని తెరాస బిఆర్ఎస్ గా మారిందన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, దళిత బంధు లాంటి పథకాలన్ని దేశమంతా అందాలన్నది కెసిఆర్ ఉద్దేశం అన్నారు.