కెసిఆర్ జన్మదినం సందర్బంగా రక్తదానం చేసిన తెరాస నాయకులు

Published: Thursday February 17, 2022
మధిర ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు ఏడవ వార్డులో రక్త దాన శిబిరం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్బంగా మున్సిపల్ శాఖా మాత్యులు కే టి ఆర్ పిలుపు మేరకు, మధిర నియోజకవర్గంలో మధిర నియోజకవర్గ ఇంచార్జి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపు మేరకు మధిర నియోజకవర్గంలో యువజన సంఘం ఆధ్వర్యంలో మధిరలో తలసేమియా బాధితుల సహాయార్థం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తెరాస ఉద్యమకారులు, తెరాస పట్టణ కా.ని. కార్యదర్శి మేడికొండ. కిరణ్ ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు, వీరితోపాటు 7వార్డు యూత్ అధ్యక్షులు పల్లపాటి సుధీర్, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.