ఇబ్రహీంపట్నం జూలై తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి
ఆగస్టు 7 8 9 తేదీలలో సంగారెడ్డి లో జరిగే కెవిపిఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సంగారెడ్డి లో జరిగే కెవిపిఎస్ రాష్ట్ర మూడవ మహాసభల జయప్రదం చేయాలని రాష్ట్ర మహాసభలు కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా గా కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడ సామెల్ ,ప్రకాష్ కరత్ లు మాట్లాడుతూ కెవిపిఎస్ 24 ఏండ్ల ప్రస్థానంలో ఎస్సి ఎస్టీ కమీషన్, ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, దళితులకు 2ఎకరాల స్మశాన వాటికల స్థలం స్రూపొందించుకుంటామన్నారు దళితులకు 101యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలనే జీవో నెం 342,కులాంతర వివాహితుల ప్రోత్సాహకం పెంపు జీవో నెం 12 ఇలాంటి అనేక విజయాలు సాధించిందన్నారు.రాబోయే మూడేళ్ళ కాలం లో చేపట్టబోయే భవిష్యత్ రూపొందించుకుంటామన్నా హఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ ,బుచ్చయ్య ,వెంకటేష్ జిల్లా కమిటీ సభ్యులు వీరేష్, దుర్గారావు యాదగిరి సిఐటియు నాయకులు బుగ్గ రాములు యాదగిరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: